ఆస్పత్రిలో పేలుడు.. 19 మంది మృతి

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో గ్యాస్‌ లీక్ అయ్యి సంభవించిన పేలుడు ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు......

Published : 02 Jul 2020 01:20 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో గ్యాస్‌ లీకై సంభవించిన పేలుడు ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు సంభవించినట్లు సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి పోస్ట్‌ చేసిన వీడియోల ఆధారంగా తెలుస్తోంది. గ్యాస్‌ లీక్‌ వల్లే మంటలు చెలరేగినట్లు టెహ్రాన్‌ డిప్యూటీ గవర్నర్‌ హమిద్‌రెఝా ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది సహా ఇతర బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని