నిన్న చందానగర్.. నేడు వనస్థలిపురం!
రెండు నెలల వ్యవధిలోనే రెండు చోరీలు.. ఒకటి మరువక ముందే.. మరొకటి.. నిన్న చందానగర్.. నేడు వనస్థలిపురం. నగరంలో ఏటీఎం చోరీలు దడ పుట్టిస్తున్నాయి. ..
రెండు నెలలు.. రెండు ఏటీఎంల్లో చోరీ
హైదరాబాద్: రెండు నెలల వ్యవధిలోనే రెండు చోరీలు.. ఒకటి మరువక ముందే.. మరొకటి.. నిన్న చందానగర్.. నేడు వనస్థలిపురం. నగరంలో ఏటీఎం చోరీలు దడ పుట్టిస్తున్నాయి. ప్రధాన రహదారిపై ఉన్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పంజా విసురుతున్నారు.
పోలీస్స్టేషన్కు సమీపంలోనే..
అక్టోబర్ 5న హైదరాబాద్ - ముంబయి ప్రధాన రహదారిపై చందానగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో సుమారు రూ.15 లక్షల చోరీ జరిగింది. దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో లోపలికి ప్రవేశించి షట్టర్ మూసి యంత్రాన్ని తెరిచి డబ్బులు కాజేసి పరారయ్యారు. ఈ ఏటీఎం చందానగర్ ఠాణాకు కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.
ఎందుకిలా..?
దేశంలోని అన్ని ఏటీఎం కేంద్రాలు ముంబైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమై ఉంటాయి. ట్యాంపరింగ్కు పాల్పడినా, ధ్వంసం చేసేందుకు యత్నించినా వెంటనే అలారం మోగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అత్యవసర మెసేజ్ మేనేజర్కు చేరుతుంది. మేనేజర్ పోలీసులను అప్రమత్తం చేస్తారు. నగరంలో సెన్సార్లుతో కూడిన కొత్త యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఏటీఎం ధ్వంసం.. రూ.8 లక్షలు అపహరణ
వనస్థలిపురం: వెల్డింగ్ మిషన్తో ఏటీఎంను కోసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన వనస్థలిపురంలో కలకలం రేపింది. వనస్థలిపురం పోలీసుల వివరాల ప్రకారం సహారాస్టేట్స్ రోడ్డులోని ఎంఈరెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాలు ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం రాత్రి 2.30 సమయంలో దుండగులు ప్రవేశించి ఏటీఎంను వెల్డింగ్ మిషన్తో పగలగొట్టారు. రూ.8 లక్షలు ఎత్తుకెళ్లారు. కింద భాగం తెరచుకోకపోవడంతో రూ.1.1లక్షలను వదిలివెళ్లారు. ఫుటేజీ దొరక్కుండా సీసీ కెమెరాల బాక్స్ను తీసుకెళ్లారు. ఎర్టిగా కారులో ఐదుగురు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని డీసీపీ సన్ప్రీత్సింగ్, క్రైమ్ డీసీపీ యాదగిరిరెడ్డి, ఏసీపీ శంకర్ పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్