Crime News: భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని..

భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్యే అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన  ఆదివారం పెనుగంచిప్రోలులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన చెరుకుమల్లి

Updated : 21 Feb 2022 07:37 IST

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో ఘటన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్యే అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన  ఆదివారం పెనుగంచిప్రోలులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన చెరుకుమల్లి మధుబాబుకు హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింటివారు వరకట్న వేధింపులకు పాల్పడడంతో గత మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో సరిత కేసు పెట్టగా కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మధుబాబు గతంలో రెండుసార్లు వివాహం చేసుకోబోగా సరిత అడ్డుకుంది. ఈసారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకుని వివాహం చేసుకునేందుకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చారు. ఆలయంలో పెద్దతిరునాళ్ల కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. బేడా మండపంలో వివాహతంతు జరుగుతుండగా సరిత ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెళ్లికుమారుడుగా ఉన్న మధుబాబుపై మెరుపు దాడి చేసి వివాహాన్ని అడ్డుకున్నారు. గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లికుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మధుబాబు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధుబాబును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. తర్జనభర్జనల అనంతరం ఇప్పటికే భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని వెళ్ల్లిపోయినట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని