పెళ్లి పేరుతో యువతి టోకరా!
లక్షలాది రూపాయలు కట్నకానుకలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
వీఆర్వో, ఆమె కుమార్తెపై ఎస్పీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు
బాధితులు ఎస్పీకి ఇచ్చిన శుభలేఖ
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే : లక్షలాది రూపాయలు కట్నకానుకలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాలు బాధితుల మాటల్లోనే.. ‘నేను బీటెక్ చదివాను. ప్రస్తుతం గుంటూరులో మోటార్ కంట్రోలర్ మెకానిక్గా పనిచేస్తున్నాను. తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్కడినే కుమారుడి. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి పరిచయమై జిల్లాలోని ఓ వీఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. తండ్రిలేరని తాను కట్నం ఇచ్చుకోలేనని తల్లి చెప్పడంతో పైసా కట్నంలేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహమైంది. అమ్మాయికి రూ. 2 లక్షలతో ఆభరణాలు చేయించాం. మా ఊరులో రూ. 6 లక్షలతో రిసెప్షన్ చేశాం. వెంటనే ఆమె తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లింది. తొలిరాత్రి నుంచి యువతి నన్ను దూరంపెట్టింది. ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు. నెలల తరబడిగా ఆమె పుట్టింటి నుంచి రావడంలేదు. మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకు తీసుకోమన్నారు. ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండోరోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారని మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే మాకు తెలిసింది మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో గతేడాది ఓ ఎయిర్ఫోర్సు ఉద్యోగితో నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహమంటూ తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.