Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఫ్లాట్‌లోని పడక గదిలో చనిపోయిన ఘటన మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ కాలనీలో కలకలం రేపింది.

Updated : 17 Aug 2022 06:56 IST

నార్సింగి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఫ్లాట్‌లోని పడక గదిలో చనిపోయిన ఘటన మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ కాలనీలో కలకలం రేపింది. నార్సింగి ఎస్‌ఐ సమరంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కృష్ణాజిల్లా గన్నవరం మండలం, నున్న గ్రామానికి చెందిన వర్జరక పూర్ణ సాయిసందీప్‌(22), అతని బంధువు యెర్కరెడ్డి భార్గవరెడ్డి(31), మరోవ్యక్తి జశ్వంత్‌తో కలిసి పుప్పాలగూడ అల్కాపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. భార్గవరెడ్డి ఐసీఐసీఐలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సాయిసందీప్‌, జశ్వంత్‌ ఇటీవల ఊరెళ్లారు. మంగళవారం వచ్చిన సందీప్‌ ఫ్లాట్‌ తలుపు ఎంతసేపు తట్టినా భార్గవరెడ్డి తీయలేదు. వాచ్‌మెన్‌ సహాయంతో వంటగది చిమ్నీలో నుంచి లోపలికి వెళ్లగా, పడక గదిలో నేలపై భార్గవరెడ్డి మృతిచెంది ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని