అప్పుల బాధతో మహిళా రైతు బలవన్మరణం
అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు.
పెదనందిపాడు, న్యూస్టుడే: అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. అందులో మిర్చి, సెనగ, ఇతర పంటలు సాగు చేశారు. చీడపీడలు ఆశించి పైర్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.50లక్షలు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది సోమవారం ఇంట్లో పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రత్తిపాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. భర్త మస్తాన్వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు