గ్యాస్లీకై మహిళా కార్మికులకు అస్వస్థత
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని కార్బన్ పరిశ్రమలో బుధవారం గ్యాస్ లీకై 11 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
కార్బన్ పరిశ్రమలో సంఘటన
ముగ్గురి పరిస్థితి విషమం
రేణిగుంట, న్యూస్టుడే: తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని కార్బన్ పరిశ్రమలో బుధవారం గ్యాస్ లీకై 11 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కార్బన్ పరిశ్రమలో నియోలింక్స్ విభాగంలో ఒక మొబైల్ కేబుల్ పరిశ్రమకు చెందిన బాక్సులను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సుమారు 150 మంది మహిళా కార్మికులు పనులు చేస్తున్నారు. ఇందులో ఒక విభాగంలో గ్యాస్ లీకై అక్కడే పని చేస్తున్న చందన, రీటా, సుప్రియ, శిరీష, విజయ, విమల, జయంతి, భూమిక, ఎన్.శిరీష, అలేఖ్య, రిమి కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో సుప్రియ, శిరీష, అలేఖ్య ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అమర ఆస్పత్రికి తరలించినట్లు బాలాజీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. గాజులమండ్యం ఎస్సై ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్