Eluru: అమెరికాలో కాల్పులు.. ఏలూరు యువకుడి మృతి

ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ (25) మృతి చెందారు.

Updated : 21 Apr 2023 12:59 IST

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్‌ (25) మృతి చెందారు. ఎంఎస్‌ చేయడానికి వెళ్లిన సాయేశ్‌ గ్యాస్‌ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతణ్ని తుపాకీతో కాల్చారు. సాయేశ్‌ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయారు. తల్లి, అన్నయ్య ఉన్నారు. సాయేశ్‌  2021 నవంబరులో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని