వైకాపాలో చేరకపోతే.. చంపేస్తాం

వైకాపాలో చేరు, లేదంటే నీ ప్రాణం తీస్తామని ఆ పార్టీ నాయకుడితో పాటు అనుచరులు హెచ్చరిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామ సర్పంచి పురుషోత్తం ఆరోపించారు.

Updated : 30 Jun 2023 05:22 IST

మంత్రి సోదరుడి హెచ్చరిక

ఎస్పీకి తెదేపా సర్పంచి ఫిర్యాదు

కర్నూలు, న్యూస్‌టుడే: వైకాపాలో చేరు, లేదంటే నీ ప్రాణం తీస్తామని ఆ పార్టీ నాయకుడితో పాటు అనుచరులు హెచ్చరిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామ సర్పంచి పురుషోత్తం ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి సోదరుడు, ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణతో తనకు ప్రాణహాని ఉందని, పోలీసు రక్షణ కల్పించించాలని కోరుతూ సెల్ఫీ వీడియో, మెసేజ్‌ను కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌కు పంపినట్లు తెలిపారు. గురువారం రాత్రి గుంతకల్లు నుంచి కుందనగుర్తికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుమ్మనూరు నారాయణ, ఆయన అనుచరులు కారులో వెంటపడ్డారని అందులో పేర్కొన్నారు. చిప్పగిరి మండలంలో తెదేపాకు అనుకూలంగా ఉన్నది నీవొక్కడివేనని, నువ్వూ వైకాపాలో చేరాలని రెండు వారాలుగా వారు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీకి సెల్ఫీ వీడియో, మెసేజ్‌ పంపడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని