Minister Venu: ఏపీ మంత్రి చెల్లుబోయిన పేరు చెప్పి.. దందా
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వరసకు సోదరుడినవుతానంటూ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు.
పశువుల వ్యాపారికి బెదిరింపులు, రౌడీషీటర్ అరెస్టు
తొలుత గంజాయి కేసులో అదుపులోకి?
హనుమాన్ జంక్షన్, న్యూస్టుడే: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వరసకు సోదరుడినవుతానంటూ దందాలకు పాల్పడుతున్న వ్యక్తిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో సీఐ ఏఎన్ నరసింహమూర్తి, ఎస్సై ఏడీఎల్ జనార్దన్ నిందితుడి వివరాలు వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన దొంగల శ్రీధర్ మంత్రి చెల్లుబోయిన స్టిక్కరు ఉన్న వాహనంలో తిరుగుతున్నాడు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన తొందూరు శ్యామ్యూల్ అనే పశువుల వ్యాపారిని ఇటీవల కలిశాడు. మంత్రి పేరు చెప్పుకుని రామచంద్రాపురంలోనూ పశువుల వ్యాపారం చేద్దామంటూ కొంతకాలం కిందట శ్యామ్యూల్ వద్ద రూ.10 వేల నగదు తీసుకున్నాడు. తర్వాత కూడా పదేపదే డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ నెల 25న శ్యామ్యూల్ నూజివీడు వెళ్తుండగా, శ్రీధర్ అడ్డగించి బెదిరింపులకు దిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీధర్ను అరెస్టు చేసి, నూజివీడు కోర్టులో హాజరు పర్చామని పోలీసులు చెప్పారు. శ్రీధర్పై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉందని, ప్రత్తిపాడు, ద్రాక్షారామం, గొల్లపాలెం, రాజానగరం, అన్నవరం, ఆలమూరు స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.
అంతా అనుమానాస్పదమే
దొంగల శ్రీధర్ అరెస్టు వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ నెల 24న రాత్రి శ్రీధర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉన్నత స్థాయిలో వచ్చిన ఆదేశాలతో తమ పరిధి కానప్పటికీ, ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు పశువుల సంతకు వెళ్లి మరీ అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ రోజే ఉంగుటూరు పోలీస్ స్టేషన్కు తరలించగా, గంజాయి రవాణా కేసులో అరెస్టు చేయనున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు ఆ వివరాలేవీ వెల్లడించలేదు. నిందితుడి ఫొటోలు కూడా మీడియాకు విడుదల చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ