AP Grama Volunteer: వివాహిత చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లిన వాలంటీరు
ఇంటి అరుగుపై కూర్చున్న వివాహితను ఓ వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లబోయాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు.
ప్రతిఘటించడంతో మహిళపై దాడి
తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారని బెదిరింపు
చెరుకుపల్లి గ్రామీణ (ఆళ్లవారిపాలెం), న్యూస్టుడే: ఇంటి అరుగుపై కూర్చున్న వివాహితను ఓ వాలంటీరు చేయిపట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లబోయాడు. ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు గుమిగూడారు. దీంతో బయటకు వెళ్లిపోయిన వాలంటీరు కర్రలతో తన అనుచరులను వెంటేసుకుని వచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని బాప్టిస్టుపాలేనికి చెందిన ఓ వివాహిత ఆదివారం ఇంటిముందు అరుగుపై కూర్చున్నారు. ఆ సమయంలో వాలంటీరు గాలిమోటు లోకకుమార్ ఆమె వద్దకు వచ్చి ‘నువ్వంటే నాకు ఇష్టం’ అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు.
ఆమె వెంటనే తేరుకుని, చేయి విడిపించుకుంటూ కేకలు వేశారు. ఎందుకు అరుస్తున్నావంటూ అతడు కాలితో తన్నడంతో ఆమె పడిపోయారు. చుట్టుపక్కల వారు రావడంతో ‘నీ అంతు చూస్తా.. నన్ను ఎవ్వడూ ఏం చేయలేరు’ అంటూ అతడు వెళ్లిపోయాడు. కాసేపటికి తన బంధువులు, అనుచరులతో కర్రలు తీసుకుని వచ్చాడు. వారి దాడి నుంచి తప్పించుకుని, బాధితురాలిని ఆమె బంధువులు ఆటోలో తీసుకుని చెరుకుపల్లి వచ్చారు. నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా ఇలాగే ఈ వాలంటీరే తనతో అమానుషంగా ప్రవర్తించాడని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. వాలంటీరే దౌర్జన్యం చేసి, తిరిగి వారిపైనే కేసులు పెడతాడని, అదేమంటే తన వెనుక ఎంపీ మోపిదేవి ఉన్నారంటూ బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు.
వాలంటీరు, అతని అనుచరులు, బంధువులతో తనకు, తన బంధువులకు ప్రాణహాని ఉందని తెలిపారు. వాలంటీరు లోకకుమార్ గ్రామంలో తనలాంటి వారి నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోగా, దిక్కున్నచోట చెప్పుకోవాలని దౌర్జన్యం చేస్తున్నాడని వార్డు సభ్యురాలు మరియమ్మ వాపోయారు. తాము వైకాపా వారిమేనని, వాలంటీరు అరాచకాలకు తట్టుకోలేకపోతున్నామని కొందరు మహిళలు పోలీసుల వద్ద విలపించారు. పింఛను ఇచ్చే నెపంతో వాలంటీరు ఇళ్లకు వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకే అతడిని తాము ఇళ్లకు రానీయడం లేదని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. -
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన సిబ్బంది ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. అతడు సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) రక్షణ వలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. -
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం.. సీసీ కెమెరాలో రికార్డు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. -
తెదేపా కార్యకర్తపై క్రికెట్ స్టంప్తో దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. -
ఒక దొంగ.. 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం
ఒకే ఒక్కడు... ఒకే ఏడాది 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం. నిరుడు దేశంలోని వివిధ నగరాలను విమానాల్లో చుట్టేసిన అతను ఒక దొంగ అంటే నమ్ముతారా? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ దిల్లీ పోలీసులకు చిక్కాడు. -
30 మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో 9 మంది కీలక మావోయిస్టు నేతలు సహా 30 మంది దళ సభ్యులు మంగళవారం పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. -
మిధాని అదనపు జనరల్ మేనేజర్పై సీబీఐ కేసు
కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన కంచన్భాగ్ మిధాని (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) అదనపు జనరల్ మేనేజర్ టి.జానకిరాంపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. -
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి
అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న చిన్నారిపైకి ఓ శునకం మృత్యువై వచ్చింది. తీవ్రంగా దాడి చేయడంతో ఆ ఐదు నెలల పసిప్రాణం విలవిల్లాడింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి