Crime News: కదులుతున్న బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త

గర్భంతో ఉన్న భార్యను భర్త.. కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేయడంతో ఆమె మృతిచెందింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని దిండుక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 31 Jan 2024 07:38 IST

అక్కడికక్కడే బాధితురాలి మృతి

తమిళనాడులో అమానుష ఘటన

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: గర్భంతో ఉన్న భార్యను భర్త.. కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేయడంతో ఆమె మృతిచెందింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని దిండుక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంబార్‌పట్టికి చెందిన వెళ్లమెయ్యన్‌ కుమారుడు పాండియన్‌కు, కల్‌వెలిపట్టికి చెందిన బాలమురుగన్‌ కుమార్తె వళర్మతికి (18) ఎనిమిది నెలల కిందట వివాహమైంది. వళర్మతి ప్రస్తుతం అయిదునెలల గర్భిణి. సోమవారం రాత్రి భార్యాభర్తలు కల్‌వెలిపట్టి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండియన్‌ మద్యం మత్తులో ఉండగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కనవాయిపట్టి సమీపంలో పాండియన్‌ భార్యను బస్సులోంచి తోసేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని