Quiet Firing: క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..!
Quiet Firing | ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024లోనూ అది కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక కొత్త మార్పులే దీనికి కారణం. ఈ క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని నేరుగా తొలగిస్తే.. మరికొన్ని పరోక్షంగా ఉద్యోగులు వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే క్వైట్ ఫైరింగ్ (Quiet Firing).
ఏంటీ క్వైట్ ఫైరింగ్?
పొమ్మనలేక పొగబెట్టడం అనే సామెత వినే ఉంటారు! క్వైట్ ఫైరింగ్ (Quiet Firing) అంటే సరిగ్గా అదే. ఉద్యోగులను తీసేయాలనుకున్నప్పుడు.. కంపెనీలోని పరిస్థితులను యాజమాన్యాలు అసౌకర్యంగా మారుస్తాయి. నేరుగా పొమ్మని చెప్పలేక ఈ తరహా పద్ధతులను అనుసరిస్తుంటాయి. వసతులను తగ్గించడం, పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం, అధిక పనిభారం, పనిగంటలను పెంచడం, ఏమాత్రం అవగాహనలేని పనిని అప్పగించడం.. వంటివి చేస్తుంటాయి. ఫలితంగా ఉద్యోగికి విసుగు, చిరాకు పుట్టి తనకు తానే వైదొలిగే పరిస్థితులను సృష్టిస్తాయి.
ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని వారి బాస్లు విమర్శిస్తుంటారు. ఏం పని చేసినా దానిపై నిఘా వేస్తారు. ఏమాత్రం పొరపాటు దొర్లినా స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంటుంది. ఉద్యోగుల సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి మేరకే ఇలాంటి చర్యలు చేపడుతుంటారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి.. ఇక చేసేది లేనప్పుడు ఇలాంటి పోకడలను అనుసరిస్తారు. తద్వారా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.
ఎందుకు ఇలా..
కంపెనీ తమ సిబ్బందిని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతులను అనుసరిస్తుంటాయి. అయితే, నేరుగా లేఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, అలా చేస్తే నిబంధనల ప్రకారం.. కొన్ని రకాల పరిహారాలు చెల్లించాలి. అప్పటి వరకు ఉన్న బకాయిలను ఇచ్చేయాలి. లీవ్లు, ప్రోత్సాహకాలేమైనా మిగిలిపోయి ఉంటే వాటిని క్లెయిం చేసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. లీగల్గానూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు క్వైట్ ఫైరింగ్ (Quiet Firing) వంటి పద్ధతులను అనుసరిస్తాయి.
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
ఎలా గుర్తించడం..
కొన్ని సంకేతాలను బట్టి ఒక ఉద్యోగి తనపై క్వైట్ ఫైరింగ్ (Quiet Firing) జరుగుతోందని గుర్తించొచ్చు. ప్రమోషన్లు-ఇంక్రిమెంట్లు ఆపడం, పనిభారం పెంచడం, పనివేళల్లో మార్పులు, వసతులను తగ్గించడం, ప్రోత్సాహకాలను కుదించడం, బోనస్లు ఆపేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం, కీలక నిర్ణయాల్లో భాగస్వాములను చేయకపోవడం, సెలవులు నిరాకరించడం వంటి సంకేతాలను బట్టి క్వైట్ ఫైరింగ్ జరుగుతోందని గుర్తించొచ్చు.
తొందరపడొద్దు..
వీటిలో కొన్నింటిని గుర్తించినంత మాత్రాన.. కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటుందనే నిశ్చితాభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మీ బాస్తో మాట్లాడి పరిస్థితిని అంచనా వేయాలి. మొత్తంగా సంస్థకు మీరొక ‘అసెట్’గా మారేందుకు కృషి చేయాలి. మీవైపు ఏ పొరపాటు లేదని గుర్తిస్తే మాత్రం.. వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మేలు!
నిజానికి క్వైట్ ఫైరింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇలాంటి పద్ధతులు ఎప్పటి నుంచో రహస్యంగా అమలవుతూనే ఉన్నాయి. కానీ, ఇటీవల తొలగింపులు పెరగడం.. దానికి కార్పొరేట్ సంస్కృతిలోని కొత్త ధోరణులు తోడవ్వటంతో ఈ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి బడా సంస్థలు సైతం ఈ తరహా విధానాలను అవలంబిస్తున్నాయని కొన్ని ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి.
క్వైట్ హైరింగ్ కూడా ఉంది..
క్వైట్ ఫైరింగ్ తరహాలోనే క్వైట్ హైరింగ్ (Quiet Hiring) అనే ట్రెండ్ కూడా ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త వారిని నియమించుకోకుండానే కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడాన్నే క్వైట్ హైరింగ్ (Quiet Hiring)గా వ్యవహరిస్తున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్. ఉద్యోగుల కొరత ఉండి, టార్గెట్లు అందుకోవడానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM