Lucknow vs Kolkata: లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
లఖ్నవూపై కోల్కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలక్ష అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది.
లఖ్నవూ: సొంతగడ్డపై లఖ్నవూ తడబడింది. ఆ జట్టుపై కోల్కతా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని లఖ్నవూ ఛేదించలేకపోయింది. 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. మార్కస్ స్టాయినిస్ (36; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (25: 21 బంతుల్లో 3 ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అర్షిన్ కుల్కర్ణి (9), దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), ఆయుష్ బదోని (15), ఆష్టన్ టర్నర్ (16), కృనాల్ పాండ్య (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుణ్ చక్రవర్తి (3/30), హర్షిత్ రాణా (3/24), రస్సెల్ (2/17) లఖ్నవూ పతనాన్ని శాసించారు. స్టార్క్, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్కతా అగ్రస్థానానికి చేరుకుంది.
టపాటపా వికెట్లు
లక్ష్యఛేదనలో లఖ్నవూకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్క్ బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ అర్షిన్ కులకర్ణి (9) ఔటవడంతో లఖ్నవూ పతనం ఆరంభమైంది. రమణ్దీప్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో అర్షిన్ వెనుదిరిగాడు. అనంతరం స్టాయినిస్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో లఖ్నవూ గట్టిపోటీ ఇచ్చేలా కనిపించింది. హర్షిత్ బౌలింగ్లో రాహుల్ ఔటైన తర్వాత లఖ్నవూ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వేగంగా వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని చవిచూసింది. దీపక్ హుడాను చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టాయినిస్ను, హిట్టర్ నికోలస్ పూరన్ను రస్సెల్ వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. నరైన్ బౌలింగ్లో బదోని.. స్టార్క్కు చిక్కాడు. టర్నర్ వరుణ్ చక్రవర్తికి రిట్నర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్షిత్ బౌలింగ్లో కృనాల్ పాండ్య.. ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇవ్వడంతో లఖ్నవూ పనైపోయింది. కాసేపటికే ఆ జట్టు ఆలౌటైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ (81; 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లు) మరోసారి చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32; 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. రఘువంశీ (32; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (23; 15 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రింకు సింగ్ (16), ఆండ్రీ రస్సెల్ (12) భారీ స్కోరు చేయలేకపోయారు. చివర్లో రమణ్దీప్ సింగ్ (25; 6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. లఖ్నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్విర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది. -
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే