Chittoor: బొమ్మ తుపాకీ కాదంటూ కాల్చి చూపించిన మాజీ జవాను
తన వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అంటూ స్నేహితులు హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఓ మాజీ సైనికుడు బార్లో కాల్పులు జరిపిన ఘటన ఇది.
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే: తన వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అంటూ స్నేహితులు హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఓ మాజీ సైనికుడు బార్లో కాల్పులు జరిపిన ఘటన ఇది. చిత్తూరుకు చెందిన మల్లికార్జున 2021లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందాడు. విధుల్లో ఉన్న సమయంలోనే లైసెన్సుతో ఓ పిస్టల్ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ బార్కు స్నేహితులతో కలిసి వెళ్లారు. మద్యం తాగుతున్న క్రమంలో తన దగ్గర ఉన్న పిస్టల్ నిజమైనది కాదంటూ స్నేహితులు గేలి చేయడాన్ని మల్లికార్జున సహించలేకపోయాడు. అసహనానికి గురై పిస్టల్ను తీసి నేలవైపు గురిపెట్టి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో బార్లో ఉన్నవారందరూ భయపడి పారిపోగా.. నిందితుడూ చల్లగా జారుకున్నాడు. స్థానికులు డయల్-100కు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు పోలీసులు వచ్చి పరిశీలించారు. బుధవారం ఉదయం బుల్లెట్ అవశేషాలు, ఖాళీ తుపాకీ కేస్లు స్వాధీనం చేసుకుని మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం ఆర్పీఎఫ్లో కాంట్రాక్టు పద్ధతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.