AP News: భర్తకు బ్లాక్‌ ఫంగస్‌.. భార్య ఆత్మహత్య

భర్త బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతుండగా.. నయమవుతుందో లేదోనన్న ఆందోళనతో అతని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం చోటు చేసుకుంది. పెదపూడి మండలం, జి.మామిడాడకి చెందిన సబ్బెళ్ల తిరపారెడ్డి కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అతనికి తోడుగా

Updated : 27 May 2021 07:27 IST

కాకినాడ (మసీదు సెంటర్‌), న్యూస్‌టుడే: భర్త బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతుండగా.. నయమవుతుందో లేదోనన్న ఆందోళనతో అతని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం చోటు చేసుకుంది. పెదపూడి మండలం, జి.మామిడాడకి చెందిన సబ్బెళ్ల తిరపారెడ్డి కొవిడ్‌ నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అతనికి తోడుగా భార్య బుల్లిమావతి (48) ఉంటున్నారు. మంగళవారం ఆసుపత్రికి వచ్చిన కుమార్తె భువనేశ్వరితో బుల్లిమావతి తన ఆవేదన పంచుకొని విలపించారు.ఆ తర్వాత అందరూ నిద్రపోయాక ఆమె వార్డులోని మరుగుదొడ్డి కిటికీకి చీరతో ఉరి వేసుకొంది. బుధవారం వేకువజామున 3 గంటలకు కుమార్తె గుర్తించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడున్న వైద్యులు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని