సెల్‌ఫోన్‌ దొంగిలించాడంటూ.. తలకిందులుగా వేలాడదీశారు

కర్ణాటకలోని మంగళూరు జాలర్ల కాలనీలో సెల్‌ఫోన్‌ దొంగిలించాడంటూ ఓ వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళూరు జాలర్ల కాలనీలో

Updated : 24 Dec 2021 08:06 IST

మంగళూరు, న్యూస్‌టుడే: కర్ణాటకలోని మంగళూరు జాలర్ల కాలనీలో సెల్‌ఫోన్‌ దొంగిలించాడంటూ ఓ వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళూరు జాలర్ల కాలనీలో వైల శీను (ఇతను ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడని గుర్తించారు) అనే జాలరి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే కోపంతో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ఇతర జాలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో వదిలేయకుండా తీరంలో తలకిందులుగా వేలాడదీశారు. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని పదేపదే మొత్తుకున్నా వినిపించుకోకుండా హింసించారు. ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని