Crime News:ఆన్లైన్ ఆటల్లో అప్పులపాలై భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్లకు బానిసై, పనికి వెళ్లకుండా, అప్పుల పాలైన వ్యక్తి... భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నైలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...
ప్రైవేటు ఉద్యోగి ఘాతుకం
కాంచీపురం, చెన్నై (ఆర్కేనగర్), న్యూస్టుడే: ఆన్లైన్ గేమ్లకు బానిసై, పనికి వెళ్లకుండా, అప్పుల పాలైన వ్యక్తి... భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నైలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... పెరుంగుడి పెరియార్లోని ఓ అపార్టుమెంట్లో మణికంఠన్ (36), తార (35) దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారులు ధరణ్ (10), దహాన్ (1) ఉన్నారు. కోయంబత్తూర్కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఆన్లైన్లో నగదు పెట్టి గేమ్లు ఆడుతూ అప్పులపాలయ్యారు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబరు 31న రాత్రి ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం