Andhra News: కన్న తల్లిని కాలితో తన్ని.. కర్రతో కొడుతూ..

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధి బ్రహ్మానందపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం వివరాలను

Updated : 19 Feb 2022 06:47 IST

ఆస్తి కోసం కొడుకు కర్కశత్వం

తాడేపల్లి, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధి బ్రహ్మానందపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం వివరాలను పోలీసులు తెలిపారు. వృద్ధురాలు నాగమణి భర్త వెంకటేశ్వరరావుకు ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించింది. వారు రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిని నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట కోటేశ్వరరావు చనిపోయినప్పుడు వేరే గ్రామంలో పనిచేస్తున్న కుమారుడు శేషు తన భార్యతో సహా తల్లి ఇంటికొచ్చి ఇక్కడే తిష్ఠ వేశాడు. వృద్ధాప్యంలో తోడు ఉంటున్నాడనుకున్న తల్లి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఆస్తి కోసం నిత్యం తల్లిని కష్టపెట్టేవాడు. స్థానికులు శేషును మందలించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం శేషు కాలితో తన్నుతూ, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి చేస్తూ తల్లిపై విరుచుకుపడ్డాడు. కొట్టొదని తల్లి వేడుకుంటున్నా కనికరించలేదు. దాడి దృశ్యాలను స్థానికులు వీడియో తీసి వార్డు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు సమాచారమివ్వడంతో శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలికి కుమారుడితోపాటు కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని