తన కుమారుడి మృతికి మరదలే కారణమని 9ఏళ్లుగా రగలిపోతూ.. ఆ మహిళ ఏం చేసిందంటే?

తన కుమారుడి మృతికి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ ఆమె కుమారుడిని హతమార్చి పగ తీర్చుకున్న వైనమిది.

Updated : 09 Apr 2022 08:56 IST

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: తన కుమారుడి మృతికి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ ఆమె కుమారుడిని హతమార్చి పగ తీర్చుకున్న వైనమిది. నిజామాబాద్‌లో శుక్రవారం సీపీ నాగరాజు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన రుక్సానాబేగం, అస్లాంఖాన్‌ల కుమారుడు ఫైజల్‌ఖాన్‌ తొమ్మిదేళ్ల క్రితం ఓ గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త అస్లాంఖాన్‌ చెల్లెలు అయిన సనాబేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో మార్చి 31న ఇంటి దగ్గర ఆడుకొంటున్న సనాబేగం కుమారుడు ఫయాజ్‌(7)ను ఆటోలో బోధన్‌కు తీసుకెళ్లి, అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి తిరిగి ఆటోనగర్‌కు చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతుకుతుండగా.. తానూ వెతుకుతున్నట్లు వారిని నమ్మించింది. అదే రోజు రాత్రి మళ్లీ బోధన్‌కు వెళ్లిన రుక్సానాబేగం ఆ బాలుడిని హతమార్చింది. తరవాత నిజాంసాగర్‌ కొత్త కెనాల్‌ నీటిలో పడేసింది. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు బాలుడిని హత్య చేసింది తన మేనత్త రుక్సానాబేగం, మరో బాలిక అని తేల్చారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని