మూగ జీవితో పాటే మృత్యుఒడికి..

విద్యుదాఘాతానికి గురైన మూగజీవాన్ని రక్షించేందుకు యత్నించిన రైతు దానితోపాటే మృత్యుఒడికి చేరారు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 18 May 2022 05:36 IST

విద్యుదాఘాతానికి గురైన ఎద్దును రక్షించబోయి రైతు మృతి

విద్యుదాఘాతానికి గురైన మూగజీవాన్ని రక్షించేందుకు యత్నించిన రైతు దానితోపాటే మృత్యుఒడికి చేరారు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. అల్లీపూర్‌కు చెందిన బత్తుల లస్మయ్య(65) మేత కోసం తన ఎద్దులను గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఇటీవల వీచిన ఈదురుగాలులకు తెగిపడిన ఓ విద్యుత్తు తీగ ఎద్దుకు తగలడంతో  విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన లస్మయ్య ఎద్దును కాపాడే ప్రయత్నంలో మూగజీవితో పాటు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శివారున ఉండడంతో తెగిపడిన కరెంటు తీగను ఎవరూ గమనించలేదని గ్రామస్థులు తెలిపారు.

- న్యూస్‌టుడే, రాయికల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని