పిడుగుపాటుతో రైతు దుర్మరణం

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం రాంపూర్‌ కింది తండాలో రవికుమార్‌(35) అనే రైతు మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందారు. పొలం పనులు చేస్తున్న

Published : 18 May 2022 05:36 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం రాంపూర్‌ కింది తండాలో రవికుమార్‌(35) అనే రైతు మంగళవారం పిడుగుపాటుతో మృతి చెందారు. పొలం పనులు చేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు చెట్టు కిందకు వెళ్లగా దానిపై పిడుగు పడి చనిపోయారు. చెట్టుకు కట్టేసిన ఒక ఎద్దు కూడా మృత్యువాత పడింది. రవికుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని