
కలెక్టర్, జేసీ ఫోర్జరీ సంతకాలతో ఎన్ఓసీ
రూ.కోట్ల విలువ భూమి విక్రయానికి వైకాపా కార్యకర్త ప్రయత్నం
అనంతపురం గ్రామీణం, న్యూస్టుడే: రూ.కోట్ల విలువైన భూములను అక్రమ పద్ధతుల్లో విక్రయించడానికి వైకాపాకు చెందిన ఓ కార్యకర్త కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) సృష్టించిన ఉదంతం అనంతపురంలో వెలుగుచూసింది. కూడేరు మండలం కమ్మూరులో సర్వేనెంబరు 525, 526లో 34 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భూ యాజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దస్త్రం సంయుక్త కలెక్టరు వద్ద పెండింగ్లో ఉంది. కూడేరు మండలానికి చెందిన వైకాపా కార్యకర్త శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తితో కలిసి ఓ వీఆర్వో సాయంతో నకిలీ ఎన్వోసీ సృష్టించాడు. ఈ భూమిని ఇటీవల యజమానులు విక్రయానికి పెట్టారు. అదే మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం సేకరించారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల ఫోర్జరీ సంతకాలతో ఎన్ఓసీ జారీ చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ చేస్తున్నామని ఆర్డీవో మధుసూదన్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sharad Pawar: ప్రభుత్వం మారగానే.. శరద్ పవార్కు ఐటీ నోటీసులు..!
-
Movies News
Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
-
Sports News
Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!
-
India News
India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!
-
Business News
Stock Market Update: జులై నెలకు స్టాక్ మార్కెట్ల నష్టాల స్వాగతం
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్తో టీ20, వన్డేలకు.. టీమ్ఇండియా ఆటగాళ్ల ఎంపిక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- IND vs ENG: ఆఖరి సవాల్.. భారత్కు బుమ్రా సారథ్యం