Crime news: జాలి గుండెలేని గురువులు!
తండ్రి దక్షత లేని కుటుంబం.. తల్లే కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సరైన మార్గదర్శకం లేక ఒక విద్యార్థి చదువులో బాగా వెనకబడుతున్నాడు. పరిస్థితి అర్థం చేసుకుని చేయిపట్టి చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయిని.. బడిలో అన్నం తింటున్న ఆ పిల్లాడి చేతిలో కంచం లాక్కుని ‘చదువు రాని వాడికి తిండి ఎందుకంటూ’ ఛీదరించుకోగా..
చదువు రానివాడికి తిండి దండగన్న టీచరు
టీసీ తీసుకుపొమ్మన్న మరో ఉపాధ్యాయుడు
చదువులో వెనకబడిన విద్యార్థికి అవమానాలు
మనస్తాపంతో బాలుడి బలవన్మరణం!
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే: తండ్రి దక్షత లేని కుటుంబం.. తల్లే కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సరైన మార్గదర్శకం లేక ఒక విద్యార్థి చదువులో బాగా వెనకబడుతున్నాడు. పరిస్థితి అర్థం చేసుకుని చేయిపట్టి చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయిని.. బడిలో అన్నం తింటున్న ఆ పిల్లాడి చేతిలో కంచం లాక్కుని ‘చదువు రాని వాడికి తిండి ఎందుకంటూ’ ఛీదరించుకోగా.. మరో ఉపాధ్యాయుడు టీసీ తీసుకుని వెళ్లిపోమంటూ ఛీదరించుకున్నారు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరులో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు రైలుపేటకు చెందిన అంజమ్మ భర్త ఎనిమిదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. చిన్న కుమారుడు ఆకాశ్ (18) ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనకబడి ఉండటంతో వారం కిందట ఓ ఉపాధ్యాయిని మందలించారు. మధ్యాహ్నం భోజనం చేయడానికి తోటి విద్యార్థులతో కలిసి వెళ్లగా.. ఆకాశ్ చేతిలో పళ్లెం లాక్కొని చదువురాని వాడికి అన్నం ఎందుకని తిట్టినట్లు అతడు ఇంటికి వచ్చి తల్లి వద్ద బాధపడ్డాడు. తల్లి నచ్చజెప్పి మళ్లీ బడికి పంపింది. మార్కులు సరిగా రాకపోవడంతో కొద్దిరోజుల కిందట ఓ ఉపాధ్యాయుడు టీసీ తీసుకుపోయి ప్రైవేటుగా పదో తరగతి రాసుకోమని తిట్టారని అతడు మళ్లీ తల్లికి చెప్పి ఏడ్చాడు. కొద్దిరోజులకు పరిస్థితి సర్దుకుంటుందని ఆమె నచ్చజెప్పింది. రెండురోజులుగా ఆకాశ్ బడికి వెళ్లడం మానేశాడు. తల్లి పనికి వెళ్తే ఆమె వెంటే ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అన్న వెంకటేష్ తల్లికి ఫోన్ చేసి తమ్ముడితో ఇంటి తాళం చెవి పంపించమన్నాడు. ఆకాశ్ తాళాలు తీసుకొని ఇంటికి వెళ్లాడు. బియ్యం కడికి పొయ్యి మీద పెట్టిన వెంకటేష్.. కూరగాయల కోసమని బయటకు వెళ్లాడు. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆకాశ్.. తల్లి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగివచ్చిన వెంకటేష్ అది చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే తల్లికి చెప్పగా.. గుండెలు బాదుకుంటూ వచ్చిన ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో జీజీహెచ్కు తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో తల్లి, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..