ప్రైవేటు బస్సు బోల్తా

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 13 మందికి గాయపడ్డారు. 35 మంది ప్రయాణికులతో గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న బస్సు మంగళవారం అర్ధరాత్రి నల్లజర్ల

Published : 18 Aug 2022 05:11 IST

13 మందికి గాయాలు

గోపాలపురం, నల్లజర్ల, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 13 మందికి గాయపడ్డారు. 35 మంది ప్రయాణికులతో గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న బస్సు మంగళవారం అర్ధరాత్రి నల్లజర్ల సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడ్డవారిని నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని