అప్పు చెల్లించమన్నందుకు మహిళ సజీవ దహనం

రాజస్థాన్‌ జైపుర్‌లో దారుణం జరిగింది. అప్పు చెల్లించమని అడిగినందుకు మహిళను సజీవ దహనం చేశారు. బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. చుట్టూ ఉన్న వారు ప్రేక్షకుల్లా చూస్తూ

Published : 18 Aug 2022 05:11 IST

రాజస్థాన్‌ జైపుర్‌లో దారుణం జరిగింది. అప్పు చెల్లించమని అడిగినందుకు మహిళను సజీవ దహనం చేశారు. బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. చుట్టూ ఉన్న వారు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అనంతరం మహిళను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పొరుగున ఉన్న వారికి డబ్బు అప్పుగా ఇచ్చింది. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరగా.. వారు గొడవకు దిగారు. ఈక్రమంలో ఈనెల 10న స్కూల్‌కు వెళ్తున్న మహిళపై.. అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళను ఓ వ్యక్తి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని