వివాహితపై సామూహిక అత్యాచారం!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్- డిడ్గి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక వివాహిత(24)పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్లోని
జహీరాబాద్లో దారుణం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
జహీరాబాద్ అర్బన్, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్- డిడ్గి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక వివాహిత(24)పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ నుంచి శుక్రవారం రాత్రి ఓ వివాహిత(24)ను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు శనివారం ఉదయం బాధితురాలిని స్టేషన్కు తీసుకొచ్చారు. ఆమె సికింద్రాబాద్ ప్రాంతవాసిగా గుర్తించారు. ఆమెకు వైద్యపరీక్షలు చేయించి.. సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. కొన్నాళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ఆటో ఎక్కిన ఆమెకు నిందితులు మత్తుమందు ఇచ్చి తీసుకొచ్చారా? జహీరాబాద్కు తీసుకొచ్చాక మద్యం తాగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నామని జహీరాబాద్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?