రాజస్థాన్‌లో పెళ్లి ఇంట సిలిండర్‌ పేలి ఏడుగురి మృతి

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఓ పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టోర్‌రూంలో పెట్టిన వంటగ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై పేలింది.

Updated : 10 Dec 2022 10:00 IST

మరో 52 మందికి గాయాలు

జోధ్‌పుర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఓ పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టోర్‌రూంలో పెట్టిన వంటగ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై పేలింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 52 మంది గాయపడ్డారు. వరుడు.. అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. బారాత్‌కు ముందు అతిథులందరూ టీ తాగుతుండగా గురువారం రాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ శుక్రవారం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. డుంగర్‌ సింగ్‌ అనే పోలీసు అధికారి.. దగ్ధం అవుతున్న ఇంట్లో దూకి మంటలంటుకున్న సిలిండర్లను బయటకు తీసుకొచ్చారు. సింగ్‌ తెగువకు మెచ్చిన సీఎం గహ్లోత్‌ ఆయనకు పదోన్నతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని