‘నేను చనిపోతే కుమార్తెను నా భార్య సరిగా చూసుకోదు.. అందుకే!’
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో
యాదగిరిగుట్టలో ఆరేళ్ల కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య
యాదగిరిగుట్ట పట్టణం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.యాదగిరిగుట్ట సీఐ జానకిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చందానగర్కు చెందిన చెరుకూరి సురేశ్ (40)కు భార్య, ఆరేళ్ల కుమార్తె శ్రేష్ఠ ఉన్నారు. గురువారం ఉదయం సురేశ్ తన కుమార్తెను తీసుకొని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్థానికంగా ఉన్న మయూరి గ్రాండ్ హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12:40 గంటలకు హోటల్ బిల్డింగ్పై నుంచి కుమార్తెతో కలిసి సురేశ్ కిందకు దూకారు. గమనించిన స్థానికులు, హోటల్ నిర్వాహకులు అక్కడికెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు.
సమాచారం అందుకున్న యాదగిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఘటనాస్థలి వద్ద దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా.. సురేశ్ లింగంపల్లి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సబ్ డివిజినల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చనిపోతే తన కూతురిని భార్య సరిగా చూసుకోదనే కారణంతో కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్లో వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.