ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన

Updated : 27 Dec 2022 17:21 IST

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన విజయ తన కుమారుడు హర్షవర్ధన్‌(3), కుమార్తె శ్రీకృతి(14 నెలలు)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, ఆడపడుచు వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని విజయ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని