Crime news: విశాఖలో దారుణం.. బంగారం, డబ్బుకోసం వృద్ధురాలి హత్య

విశాఖలో దారుణం జరిగింది. డబ్బు, బంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..

Updated : 07 Nov 2021 05:10 IST

విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. డబ్బు, బంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణమార్కెట్‌ దుర్గాలమ్మ గుడి సమీపంలోని పిరికి వీధిలో నల్లి అచ్చిమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడకు తాడు బిగించి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని