Crime News: మహిళను వివస్త్రను చేసిన ఘటన.. నిందితుల అరెస్టు
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత మహిళపై ప్రణాళిక ప్రకారమే దాడి చేసి చిత్ర హింసలకు గురిచేశారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఈ ఘటనపై ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత మహిళపై ప్రణాళిక ప్రకారమే దాడి చేసి చిత్ర హింసలకు గురిచేశారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఈ ఘటనపై ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు.
ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘దర్శి మండలం బొట్లపాలెంలో గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పున్నమ్మల కుమార్తె భార్గవి, అదే గ్రామం దళిత వర్గానికి చెందిన సాయిరాం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వీరి ఆచూకీ కోసం యువతి తండ్రి బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదే గ్రామంలో నివాసం ఉంటున్న సాయిరాం సోదరి మౌనికకు.. వీరి ప్రేమ వ్యవహరం తెలుసునని, భార్గవి ఎక్కడ ఉందో సమాచారం తెలిసి ఉంటుందని భావించి ఆమెపై పగ పెంచుకున్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తరువాత నీళ్లు పట్టుకోడానికి కొళాయి వద్దకు మౌనివ వెళ్లింది. అదే సమయంలో అప్పటికే అక్కడకు చేరుకున్న బ్రహ్మారెడ్డి, పున్నమ్మ ఆమెను అపహరించి, వారి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ మౌనికను ఇనుప రాడ్లతో బలంగా కోట్టారు. కాళ్లు, చేతులు కట్టిపడేసి దాడి చేశారు. చివరకు పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మౌనిక తల్లి అనురాధ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మౌనికను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మౌనికకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నాం. దాడికి పాల్పడిన బ్రహ్మారెడ్డి, పున్నమ్మలను అరెస్టు చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ