Telangana News: కూలీలపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు... ముగ్గురి మృతి

యాదాద్రి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆలేరు మండలం మంతపురి బైపాస్‌ వద్ద ట్రాక్టర్‌ను ఢీకొని.

Updated : 12 Mar 2024 16:50 IST

ఆలేరు : యాదాద్రి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆలేరు మండలం మంతపురి బైపాస్‌ వద్ద ట్రాక్టర్‌ను ఢీకొని... రోడ్డు పనులు చేస్తున్న  కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వారిని ఆలేరు ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద ఘటనతో జనగామ-హైదరాబాద్‌ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ క్లియర్‌చేశారు. మృతులు భువనగిరి మండలం రాయిగిరి వాసులు అంకర్ల లక్ష్మి, అంకర్ల కవిత, కూలీలను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ ఊరేళ్ల శ్యామ్‌గా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని