Road Accident: జనరేటర్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి.. తొమ్మిది మందికి తీవ్రగాయాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జనరేటర్ తరలిస్తున్న వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చేబ్రోలు: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జనరేటర్ తరలిస్తున్న వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని గరువుపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ జనరేటర్ను ఓ ఆటోకు వెనకభాగంలో తాడుతో కట్టి నారాకోడూరు నుంచి తెనాలికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో గరువుపాలెం వద్ద జనరేటర్-ఆటోకు కట్టిన తాడు తెగిపోయింది. అదేసమయంలో ఎదురుగా చుండూరు మండలం దిండిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలతో వస్తున్న ఆటో.. జనరేటర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణమ్మ(50), శాంబ(25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని తెనాలి, గుంటూరు, వడ్లమూడి వైద్యశాలలకు తరలించారు. జనరేటర్ను మంగళవారం తెనాలిలో జరిగే సీఎం సభకు తరలిస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్