Road Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 13 Nov 2023 07:37 IST

కమలాపురం: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని పొన్నలూరుకు చెందిన బింగి మహేశ్‌ (31), బింగి చిన్నమోహన్‌(29) నల్లలింగాయపల్లెలో తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పెట్రోల్‌ బంకు నుంచి ద్విచక్రవాహనంపై పెట్రోల్‌ తీసుకుని వెళ్తుండగా కమలాపురం మండలం పందిళ్లపల్లి వద్ద కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌, చిన్నమోహన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు