ఓఆర్ఆర్ వద్ద గుడిసెలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం జరిగింది. బియ్యం తీసుకొచ్చే లారీ అదుపుతప్పి గుడిసెలపైకి దూసుకెళ్లింది.
రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం జరిగింది. బియ్యం తీసుకొచ్చే లారీ అదుపుతప్పి గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు కుమారుడు ఉన్నారు.
సీఐ సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా నుంచి గచ్చిబౌలి వైపు బియ్యం లోడుతో లారీ వెళ్తోంది. డ్రైవర్ లారీ నడుపుతూ నిద్రమత్తులోకి వెళ్లాడు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద లారీ పైనుంచి దిగుతూ పక్కకు ర్యాంప్ను రాసుకుంటూ కిందికి వచ్చేసింది. దీంతో దగ్గరలో 30 కార్మిక కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటుండగా వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న గుడిసె పైకి లారీ వెళ్లడంతో అందులో ఉంటున్న తండ్రి రాథోడ్(48), తల్లి కమలిబాయ్(43), కుమారుడు రాథోడ్(23) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులది కర్ణాటక రాష్ట్రం. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాల్ని బయటకు లాగి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు