Secunderabad: సికింద్రాబాద్‌లో దారిదోపిడి.. కత్తితో పొడిచి బంగారంతో పరారీ

సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి దారి దోపిడి చోటుచేసుకుంది. సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న పవన్‌ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు.

Published : 05 Dec 2022 23:50 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి దారి దోపిడి చోటుచేసుకుంది. సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న పవన్‌ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి కత్తితో పొడిచాడు. అనంతరం అతడి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లాడు. హిమాయత్‌నగర్‌లోని రాధే జువెల్లర్స్‌ నుంచి పవన్‌ బంగారం తీసుకొని సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో సిటీలైట్‌ హోటల్‌కు సమీపంలో దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని