Hyderabad: డ్రగ్స్‌ పట్టివేతలో చేతివాటం.. ఎస్సై రాజేందర్‌ అరెస్ట్

డ్రగ్స్‌ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. నార్కోటిక్‌ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది.

Updated : 27 Aug 2023 19:34 IST

హైదరాబాద్‌: డ్రగ్స్‌ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. నార్కోటిక్‌ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది. దీంతో ఎస్సైను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో (సీసీఎస్‌) రాజేందర్‌ ఎస్సైగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1,750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్సై యత్నించారు.

దీనిపై నగరంలోని నార్కోటిక్‌ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందడంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్‌ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) డైరెక్టర్‌, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్‌ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్‌ సీసీఎస్‌ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని