కేరళలో ఘోరరోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి
కేరళలోని కాసర్గోడ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
కొచ్చి: కేరళలోని కాసర్గోడ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు రహదారిపై నుంచి అదుపు తప్పి ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసర్గోడ్ సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఎత్తయిన ప్రాంతం నుంచి బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.
మృతదేహాల్ని పూదమకల్లు తాలుకా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో శ్రేయస్(13), రవిచంద్ర(40), జయలక్ష్మీ(39), రాజేష్(45), సుమతిలను గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని మంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఇతర క్షతగాత్రుల్ని సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వధువు తరపు బంధువులే కావడం గమనార్హం. వారంతా సూలియా ప్రాంతం నుంచి పనత్తూరు ఎల్లుకొచ్చికి ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. బస్సు పడిన ఇల్లు జోస్ అనే వ్యక్తికి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని జోస్ తెలిపారు.
కాగా ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి
అటల్ టన్నెల్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.