Andhra News: తెనాలిలో అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టిన దుండగులు

కొందరు దుండగులు అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టిన ఘటన తెనాలిలో చోటుచేసుకుంది.  అర్ధరాత్రి సమయంలో క్యాంటీన్‌ తలుపు వద్ద నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై తెదేపా శ్రేణులు విస్మయం వ్యక్తం చేశారు.

Updated : 18 Dec 2022 05:30 IST

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు దుండగులు అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో క్యాంటీన్‌ తలుపు వద్ద నిప్పు పెట్టి పరారయ్యారు. అటుగా వెళతున్న కొందరు గమనించి మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి అన్న క్యాంటీన్‌ వాడుకలో లేక ఖాళీగా ఉంటోంది. ఈ ఘటనపై తెదేపా శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని