Bhupalapally: తండ్రిని చంపేసి.. మూడు రోజులు ఇంట్లోనే దాచి.. ఆపై..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లిలో భూ తగాదాలతో తండ్రిని కుమారుడు హతమార్చాడు.

Published : 20 Aug 2023 14:27 IST

భూపాలపల్లి రూరల్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లిలో భూ తగాదాలతో తండ్రిని కుమారుడు హతమార్చాడు. ఈ నెల 16న ధనుంజయ్‌ తన తండ్రి తిరుపతిని కర్రతో దాడి చేసి హత్య చేశాడు. 3 రోజుల పాటు తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు. తండ్రి కనిపించడం లేదంటూ 3 రోజులు ఊరు మొత్తం తిరిగాడు.

శనివారం రాత్రి తండ్రి మృతదేహాన్ని కుమారుడు చెరువులో పడేశాడు. అక్కడ నుంచి వస్తుండగా పెట్రోల్‌ అయిపోవడంతో బైక్‌ ఆగిపోయింది. ధనుంజయ్‌ వద్ద కుళ్లిన వాసన రావడంతో గ్రామస్థులు అతడిని నిలదీశారు. దీంతో తన తండ్రిని హత్య చేసినట్లు ధనుంజయ్‌ అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని