Ongole: ఒంగోలులో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్‌ వేటు

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై వేటు పడింది.

Published : 24 Nov 2023 13:34 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారని  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్లు రమణకుమార్‌, రామకృష్ణ, ఎర్రగొండపాలెం సబ్‌రిజిస్ట్రార్‌ జ్ఞానసుందర్‌ను  సస్పెండ్‌ చేశారు. ఎనీవేర్‌ కింద మార్కాపురంలో భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు