Father and Son: అనారోగ్యంతో తండ్రి.. ఆవేదనతో కుమారుడు

మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో నిశ్చితార్థం సందడి మొదలుకానుంది. ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది. అనారోగ్యంతో ఇంటిపెద్ద మృత్యువాత పడగా, ఆయన మరణవార్త విన్న

Updated : 01 Sep 2021 07:19 IST

గంటల వ్యవధిలో కన్నుమూత

కుటుంబంలో శుభకార్యానికి ముందురోజు ఘటన

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో నిశ్చితార్థం సందడి మొదలుకానుంది. ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది. అనారోగ్యంతో ఇంటిపెద్ద మృత్యువాత పడగా, ఆయన మరణవార్త విన్న కుమారుడూ తనువుచాలించడంతో ఆ ఇంట విషాదం అలముకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నంద్యాలగూడేనికి చెందిన నంద్యాల సత్తిరెడ్డి(82), లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు వెంకట్‌రెడ్డి (47), మరో ముగ్గురు కుమార్తెలు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ బోడుప్పల్‌లో స్థిరపడిన వెంకట్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. బుధవారం పెద్ద కుమార్తె శ్రావ్య నిశ్చితార్థం కావడంతో వెంకట్‌రెడ్డి ఆగస్టు 29న తల్లిదండ్రులను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. యథావిధిగా సోమవారం విధులకు వెళ్లారు. సత్తిరెడ్డి సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంకట్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఇంటికి వచ్చేలోపే తండ్రి మరణించడంతో ఆయనా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి, తర్వాత మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని