Hyderabad News: యువతులను మోసం చేసిన చర్చి పాస్టర్‌ అరెస్టు

అమాయక యువతుల బలహీనతను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ చర్చి పాస్టర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్

Updated : 07 Sep 2021 15:11 IST

హైదరాబాద్: అమాయక యువతుల బలహీనతను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ చర్చి పాస్టర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్న జోసఫ్‌ చర్చికి వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ముగ్గురు యువతలను చర్చిలోనే పెళ్లి చేసుకున్నాడు. అతడు ఈ మధ్య కాలంలో లైంగిక దాడులకు దిగడంతో పాటు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. అతని ప్రవర్తనతో మోసపోయామని గ్రహించిన యువతులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పాస్టర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ అంజిరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని