Viveka Murder Case: ముగిసిన ఉమాశంకర్రెడ్డి కస్టడీ.. పులివెందుల కోర్టులో హాజరు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు నిందితుడిని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారించారు. వివేకా హత్యకు సంబంధించి అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కస్టడీ అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉమాశంకర్రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
దీంతో సీబీఐ అధికారులు అతడిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. వివేకా హత్యలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఇది వరకే కోర్టుకు విన్నవించింది. ఉమాశంకర్ రెడ్డి వాడిన ఆయుధాల కోసం, మరి కొందరు నిందితుల పాత్ర తెలుసువకోవడానికి అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్