Viveka Murder Case: ముగిసిన ఉమాశంకర్‌రెడ్డి కస్టడీ.. పులివెందుల కోర్టులో హాజరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది.

Updated : 20 Sep 2021 14:17 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు నిందితుడిని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారించారు. వివేకా హత్యకు సంబంధించి అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కస్టడీ అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉమాశంకర్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
దీంతో సీబీఐ అధికారులు అతడిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. వివేకా హత్యలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఇది వరకే కోర్టుకు విన్నవించింది. ఉమాశంకర్ రెడ్డి వాడిన ఆయుధాల కోసం, మరి కొందరు నిందితుల పాత్ర తెలుసువకోవడానికి అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని