Ap News: సీఎం పుట్టినరోజు ర్యాలీలో ఘర్షణ.. విద్యార్థులకు గాయాలు

ఏపీ సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల ర్యాలీలో వివాదం చోటు చేసుకుంది. పలు కళాశాలలు నిర్వహించిన ర్యాలీలో డీజే పాటల విషయంలో విద్యార్థులు గొడవకు దిగారు

Published : 22 Dec 2021 01:09 IST

నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల ర్యాలీలో వివాదం చోటు చేసుకుంది. సీఎం జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట బస్టాండ్ వద్ద పలు కళాశాలల విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ గొడవకు దారి తీసింది. డీజే పాటల విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం తారస్థాయికి చేరి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగడంతో అటువైపుగా వెళ్లేవారు భయభ్రాంతులకు గురయ్యారు. గాయాలైన ఇద్దరు విద్యార్థులను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని