Terror Attack: భద్రతాదళాలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి.. శ్రీనగర్‌లో ఘటన

జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగుతున్నారు. సోమవారం కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో భాజపా నేత, ఆయన భార్యను కాల్చి చంపిన ముష్కరులు.

Published : 11 Aug 2021 01:55 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగుతున్నారు. సోమవారం కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో భాజపా నేత, ఆయన భార్యను కాల్చి చంపిన ముష్కరులు.. మంగళవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌ దాడి చేశారు. శ్రీనగర్‌లోని హరిసింగ్‌ హైస్ట్రీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానికులు గాయపడినట్లు సమాచారం.  ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్‌ డీఐజీ కిశోర్‌ప్రసాద్‌ ధ్రువీకరించారు. ‘మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఒక దుండగుడు గ్రెనేడ్‌తో భద్రతా దళాల బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాడు. అయితే ఈ ఘటనలో భద్రతాదళాలకు ముప్పు తప్పిందని సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉగ్రవాదుల వరుస దాడులు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని