Crime News: లో దుస్తుల్లో బంగారం... కస్టమ్స్‌ అధికారులకు చిక్కిన ప్రయాణికుడు

శంషాబాద్‌ విమానాశ్రయంలో దాదాపు అరకిలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అతనితో

Updated : 07 Apr 2022 12:51 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో దాదాపు అరకిలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అతనితో పాటు లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి లో దుస్తుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో 478.52 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.24.82 లక్షలు ఉంటుందని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని