శిథిల భవనాలు.. సమస్యలకు నిలయాలు
సర్కారు బడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మన ఊరు- మనబడి, మన బస్తీ- మనబడి పేరిట మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో విద్యాలయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొదటి విడతగా 260 ఎంపిక చేయగా
జిల్లాలో పాఠశాలల దుస్థితి..
నిర్మల్ అర్బన్, ఖానాపూర్ గ్రామీణం, న్యూస్టుడే
సర్కారు బడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మన ఊరు- మనబడి, మన బస్తీ- మనబడి పేరిట మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో విద్యాలయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొదటి విడతగా 260 ఎంపిక చేయగా, ఇందులో 172 చోట్ల రూ.30 లక్షల్లోపు ఉండడంతో ఇందులో నుంచి 90 బడుల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల ఇంకా మొదలే చేయలేదు. జరుగుతున్నవి సైతం నత్తనడకన సాగుతున్నాయి.
సెలవులే..
ఏళ్ల క్రితం, శిథిలావస్థకు చేరుకొని, పైకప్పులు ఊడిపడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న విధంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షం కురిస్తే సెలవులు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నాయంటే వాటి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు ఆంగ్ల మాధ్యమ బోధన, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా.. బడుల పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలను బడికి పంపాలంటే పోషకులు జంకుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు, పాలకులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు - ఎ.రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్
మన ఊరు- మన బడి పనులు పకడ్బందీగా, వేగవంతంగా జరిగేలా నిత్యం పర్యవేక్షిస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదకరంగా ఉన్న భవనాల జాబితా, వాటి మరమ్మతులు, శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా బడుల బలోపేతం కోసం, సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాం.
ఖానాపూర్ మండలం బాదనకుర్తి యూపీఎస్ భవనం దశాబ్ధాల క్రితం నిర్మించింది కావడం, పైకప్పు దెబ్బతినడంతో వర్షాలకు గదులు ఊరుస్తున్నాయి. 139మంది విద్యార్థులు చదువుకుంటున్న ఇక్కడ ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థుల సహకారంతో ఏడాదికి రూ. 20వేలు అద్దె చెల్లిస్తూ నాలుగు గదులు కిరాయికి తీసుకున్నారు. గోడలపంపు ప్రాథమిక పాఠశాల స్లాబు పగుళ్లు తేలింది. గోడలు దెబ్బతిన్నాయి. వర్షాల సమయంలో కూలిపోయే దశలో ఉన్న బడికి తమ పిల్లలను పంపమని పోషకులు ఆందోళన నిర్వహించారు.
కడెం మండలం లింగాపూర్ జడ్పీఎస్ఎస్ భవనం శిథిలావస్థకు చేరింది. వరండాలో పైకప్పు పెచ్చులూడిపోయింది. ఎప్పుడు కూలుతుందో చెప్పలేని పరిస్థితి. దస్తూరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల పరిస్థితి ఇలాగే ఉంది. దశాబ్ధాల క్రితం నిర్మించింది కావడంతో పెచ్చులూడి దెబ్బతింది. కూలిపోయే దశకు చేరినా కనీస మరమ్మతులు సైతం చేయడం లేదు.
పెంబి ప్రాథమిక పాఠశాలను ఏళ్లుగా శిథిల భవనంలోనే నిర్వహిస్తున్నారు. వర్షం కురిస్తే విద్యార్థులకు సెలవే అన్నట్టుగా తయారయ్యింది. పై కప్పు దెబ్బ తినడంతో గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు