దారి దోపిడీ
‘జిల్లాలో ఓ పార్టీ సమావేశం ఉంది. రెండు, మూడు వందల మంది హాజరవుతారు. వారిని తరలించడానికి భోజన ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కోసం నేత చెక్పోస్టు సిబ్బందికి సమాచారం ఇస్తారు.
వసూళ్లకు అడ్డాగా ‘వాంకిడి చెక్పోస్టు’
ఆర్టీఓ చెక్పోస్టు వద్ద ప్రైవేటు వ్యక్తులు
* ‘జిల్లాలో ఓ పార్టీ సమావేశం ఉంది. రెండు, మూడు వందల మంది హాజరవుతారు. వారిని తరలించడానికి భోజన ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కోసం నేత చెక్పోస్టు సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారి ఆదేశాలే మహా భాగ్యమని సదరు సిబ్బంది హుటాహుటిన సభలు, సమావేశాలకు అయ్యే ఖర్చు, భోజన ఏర్పాట్ల వ్యయాన్ని భరిస్తారు.’
* ‘మండలంలో శాంతి భద్రతలను రక్షించే పోలీసు అధికారులకు కూడా నెలకింత అని ఠంఛనుగా ముట్టజెబుతారు. వారితో పాటు స్థానిక ద్వితీయశ్రేణి నాయకులు, ప్రెస్ అని బోర్డు పెట్టుకుని తిరిగే వ్యక్తులు ఇక్కడికి వచ్చి నెలనెలా డబ్బులు తీసుకుంటారు.’ ఎవరు అడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు. వారి పనికి అడ్డురాకుండా ఉంటే చాలు.
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్: జిల్లాలో చిన్నాపెద్దా తేడా లేకుండా అధికారులు, నాయకులకు ముడుపులే అంత మొత్తంలో ఇస్తున్నారంటే వారి వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్పోస్టులో ఏటీకేడు అక్రమ వసూళ్లు పెరుగుతున్నాయి. అధికారులు తమ చేతులకు మట్టి అంటకుండా దర్జాగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని దందా కొనసాగిస్తున్నారు. ఒక్క రోజే రూ.లక్ష వరకు లెక్కల్లోకి రాని సొమ్ము కూడ పెడుతున్నారంటే అవినీతి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఎక్సైజ్ చెక్పోస్టులో ఎప్పటి మాదిరిగానే ప్రతీ వాహనానికి రూ.10 వసూలు చేయడం జరుగుతూనే ఉంది. ఈ దారి దోపిడీని నిలువరించాల్సిన అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
వాంకిడి మండల సరిహద్దు వద్ద అటవీ, మార్కెట్, ఆబ్కారీతో పాటు, ఆర్టీఓ చెక్పోస్టు ఉంది. ఉత్తర భారత దేశ రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు ఈ మార్గం గుండానే నిత్యం 800 నుంచి 1050 వాహనాల వరకు రాకపోకలు సాగిస్తాయి. వే బిల్లు లేకుండా, పరిమితికి మించి వాహనాల్లో సరకును తరలించే లారీలను గుర్తించి ఆర్టీఓ చెక్పోస్టు జరిమానా విధించాలి. అందుకు భిన్నంగా ఇక్కడ అన్నిరకాల పత్రాలు ఉన్నా రూ.500 నుంచి రూ.1500, రూ.2 వేల వరకు సరకు, లోడ్ను అనుసరించి చోదకులు ఇవ్వాల్సిందే. తరచూ ఈ మార్గంలో వెళతాం, ఎందుకు గొడవలే అని పంటి కింద బాధను అనుభవిస్తూ చోదకులు అడిగినంత సమర్పించుకుంటున్నారు.
20 మంది వరకు ప్రైవేటు వ్యక్తులు..
వాహనాలు ఆపి చెక్పోస్టులో సిబ్బంది డబ్బులు తీసుకునే వరకు అంతటా ప్రైవేటు వ్యక్తులే ఉన్నారు. వీరికి రోజుకు ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20 మంది వరకు ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నారు. కొందరు స్థానికులు కాగా, మరికొందరు అధికారుల బంధువులు, వాహన డ్రైవర్లు ఉన్నారు. నవంబర్ 2017లో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి, ఓ అట్ట పెట్టేలో చోదకుల నుంచి అక్రమంగా వసూలు చేసి ఉంచిన రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి తనిఖీలు లేకపోవడం గమనార్హం.
ప్రతీ వాహనం నుంచి రూ.10 వసూలు..
వాహన చోదకుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి
ఆబ్కారీ శాఖ చెక్పోస్టులో ఓ అధికారి, ఓ ప్రైవేటు వ్యక్తి రహదారిపై ఉన్నారు. వాహనం రాగానే ప్రైవేటు వ్యక్తి రహదారిపైకి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడితే భారీగా వసూళ్లు ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి రూ.10 చొప్పున తీసుకున్నా.. నిత్యం 800 వాహనాల వరకు అనుకున్నా రూ.8 వేలు వసూలవుతున్నట్లు. ఈ లెక్కన నెలకు రూ.2.40 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చెక్పోస్టు రహదారి అవతల వైపు ఉంది. ఆబ్కారీ చెక్పోస్టు ఉన్న విషయం సైతం చోదకులు గమనించరు. ఈ నేపథ్యంలో రోడ్డుపైనే వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM